BREAKING
హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత
www.ntodaynews.com

మదనపల్లెలో గంజాయి స్మగ్లర్‌పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Aug, 2026 - 05:34 PM
8 వీక్షణలు

మదనపల్లెలో గంజాయి స్మగ్లర్‌పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్

మదనపల్లె, అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న సయ్యద్ సుల్తాన్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో రెండో వ్యక్తిగా అతడిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రయోగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. అనంతరం నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సయ్యద్ సుల్తాన్‌పై గతంలోనే 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మాదకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి, సీఐలు రాజారెడ్డి, వెంకట రమణ, ఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, రహీముల్లా తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.