BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తమిళనాడు రాజకీయాల్లో భారీ సంచలనం.. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:23 AM
75 వీక్షణలు

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన భారీ కుట్రను నిఘా విభాగం భగ్నం చేసినట్లు సమాచారం.

టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు రూ.35 కోట్ల ఆఫర్ ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కూడా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఆఫర్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యేను ఐపీడీఎస్ కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసు బెదిరించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ మొత్తం కుట్ర వెనుక అధికార పార్టీ ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం హస్తం ఉందని ఎమ్మెల్యే ఇళయరాజా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఆరోపణలపై అధికారికంగా డీఎంకే ఇంకా స్పందించలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.