www.ntodaynews.com
వందేభారత్ రైలులో స్పెషల్ కమాండోస్
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రైల్వే భద్రతా విభాగం ప్రత్యేకంగా 'CORAS' (కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ) కమాండోలను మోహరించింది. అధునాతన ఆయుధాలతో రైలులో నిరంతరం పహారా కాస్తూ ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండోలు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, అమర్నాథ్ యాత్రికులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.