అవినీతి సొమ్ముతో గోల్డ్ లోదుస్తులు.. ఇరాక్లో సంచలనం
ఇరాక్లో అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా నిర్వహించిన సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఇరాక్ పార్లమెంట్ సభ్యురాలు నివాసంలో అధికారులు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఈ దర్యాప్తుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో బంగారంతో తయారు చేసిన లోదుస్తులు కనిపించడంతో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఆ గోల్డ్ లోదుస్తులు అలియా నసీఫ్ ఇంట్లో కాకుండా మరో మహిళా ఎంపీ నివాసంలో లభించాయని తర్వాత స్పష్టమైంది. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా జరిగింది.
అవినీతి కేసులో భాగంగా మొత్తం 67 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 53.4 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, బంగారం మరియు ఇతర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఇరాక్లో అవినీతి వ్యవహారాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.