www.ntodaynews.com
బావిలో పడిన ఎద్దును రక్షించబోయి.. ముగ్గురు మృతి
అంతర్జాతీయం
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 40 అడుగుల లోతైన బావిలో పడిన ఎద్దును రక్షించేందుకు ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగారు. అయితే ఆక్సిజన్ అందక వారు అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బావిలో విష వాయువులు లేదా ఆక్సిజన్ లేమి కారణంగానే వారు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.