www.ntodaynews.com
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి
తెలంగాణ
శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను సేవించారు.
ఉదయం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి సంప్రదాయం ప్రకారం రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
తదుపరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం గురువందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మ విశిష్టత, శ్రీశైల క్షేత్ర మహిమ, శివానందలహరి మరియు సౌందర్యలహరి స్తోత్రాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
చివరగా భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
#Srisailam #SringeriPeetham #VidhushekharaBharathi #TempleVisit #SpiritualNews #AndhraPradeshNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube