చాట్రాయిలో మృతుడి కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం
చాట్రాయిలో మృతుడి కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి సహకార సంఘం అప్పుదారుడు బుర్రి రమేష్ ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సహకార సంఘం తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు స్వయంగా బుర్రి రమేష్ కుటుంబ సభ్యురాలు బుర్రి పండుకు రూ.10,000 నగదును అందించారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, ఓరుగంటి రామారావు, రాజేష్, సంజీవరెడ్డి, జనసేన నాయకుడు తుమ్మల కరుణాకర్తో పాటు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘం ద్వారా సభ్యులకు రుణ సదుపాయాలతో పాటు ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. బుర్రి రమేష్ కుటుంబానికి సంఘం తరఫున అందించిన ఆర్థిక సహాయం కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందించేందుకు ముందుంటామని తెలిపారు.