www.ntodaynews.com
విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన
తెలంగాణ
కేంద్ర కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన
NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: శ్రీనివాస్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం శ్రేణులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి ఆరోపించారు.
సార్వత్రిక సమ్మెలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు. దేశీయ విత్తన రంగాన్ని బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కార్మికులు, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విధానాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube