BREAKING
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
www.ntodaynews.com

టైర్ల కంపెనీ మూసివేయాలని డిమాండ్

తెలంగాణ
23 Feb, 2026 - 10:14 PM
235 వీక్షణలు
టైర్ల కంపెనీ మూసివేయాలని రంగాపూర్ గ్రామస్తుల డిమాండ్ NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టైర్ల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మెరుపు చెరువు కట్ట వెనుక భాగంలో ఎన్ అండ్ ఎన్ పేరుతో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీ నుంచి అధికంగా పొగ, కాలుష్యం వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, వందలాది టైర్లు కాల్చడం వల్ల వచ్చే దుర్వాసనతో తరచూ జలుబు, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా చిన్న స్థాయిలో ప్రారంభించిన యూనిట్‌ను విస్తరించడం వల్ల కాలుష్యం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పైరాలసిస్ పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, జీవించే హక్కును హరిస్తున్న ఈ యూనిట్‌పై తక్షణ చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మైలారం జంగయ్య, వార్డు సభ్యులు ఠాకూర్ రాజేందర్ సింగ్, ప్రవీణ్, లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #YadadriBhuvanagiri #PollutionIssue #PublicHealth #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube