BREAKING
​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
www.ntodaynews.com

శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి పట్టణంలో

తెలంగాణ
18 Nov, 2025 - 10:05 AM
96 వీక్షణలు
శ్రీ సత్యాసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ - వినోద్ కుమార్ "శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి పెద్దయెత్తున భక్తుల ఖాద్రీకొండ గిరిప్రదక్షిణ" యుగయుగాల దేవుడు ఆ నరసింహుడు ప్రహ్లాద సమేతంగా కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి భవ్య క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి అతి సమీపంలో కుమ్మరవాండ్ల పల్లి గ్రామంలో కొండల నారసింహుడుగా , కాటమ రాయుడుగా స్తోత్రాద్రి కొండపై చెంచు లక్ష్మీ సమేతంగా వెలిశారు శ్రీ లక్ష్మీ నరసింహుడు.అటువంటి పవిత్రమైన కొండకి ప్రతి నెలా శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి పాదయాత్రగా బయలుదేరి శ్రీ వారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలతో , గోవింద నామ స్మరణతో శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణను ప్రారంభించడం జరుగుతుంది.శ్రీ వారి ఖాద్రీ గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు , పట్టణ ప్రముఖులు , శ్రీ ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులు తీర్థప్రసాదాలు , అల్పాహారం , మంచినీటి , మజ్జిగ ప్యాకెట్లను అందించడం జరుగును. స్తోత్రాద్రి ( కదిరి కొండ ) చుట్టూ భక్తుల సౌకర్యార్థం ఒక రహదారిని ఏర్పాటు చెయ్యాలని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కదిరి కొండ ఆలయం వద్ద భక్తులకు అల్పాహారం సదుపాయం కల్పించిన రజినీకాంత్ , ధర్మా రెడ్డి , నంగి లక్ష్మి రెడ్డి వార్లకు మరియు వారి మిత్ర బృందానికి,గిరిప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు లభించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు ప్రార్థించారు. Follow us on Website Facebook Instagram YouTube