BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 06:20 PM
59 వీక్షణలు

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

20 సంవత్సరాల పాత రోడ్డు, శాసనసభ్యులు శ్రీ సొంగారోషన్ కుమార్ ప్రత్యేక దృష్టితో నేడు అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా, తమ గ్రామ అభివృద్ధికి సహకరించినందుకు కొణిజర్ల యూత్ వారు శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను ఆధ్వర్యంలో, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు.

కొణిజర్ల గ్రామం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉండగా, శాసనసభ్యుల దూరదృష్టి, కృషితో ఈ గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. లింగపాలెం నుండి ధర్మాజీగూడెం వరకు కొణిజర్ల మీదుగా రూ. 3.75 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం, రూ. 23 లక్షలతో డ్రైన్స్ నిర్మాణం, రూ. 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదనంగా, సుమారు రూ. 2,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది.

ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కృతజ్ఞతగా, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను సత్కరించారు. అలాగే, మై టీడీపీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న భూత్ ఇంచార్జ్ పొదిల రాజు మరియు కో-ఇంచార్జ్‌లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి నుండి అందిన ప్రశంసా పత్రాలు, టీ-షర్టులను శాసనసభ్యులు అందజేసి అభినందించారు.

గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్న శాసనసభ్యులపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతోంది.