BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
31 Jul, 2026 - 08:55 PM
7 వీక్షణలు

జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ

కుప్పం, జూలై 31:

కుప్పం మండలం జరుగు పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో కుప్పం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్  ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, వ్యవసాయ శాఖ (ఏఈ), విద్యాశాఖ హౌసింగ్ శాఖ, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ హాజరై మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా అందేలా చూడటమేనని వివరించారు.


ఎస్టీ కుటుంబాలు మూఢనమ్మకాలను విడిచిపెట్టి, సమాజంతో కలిసిమెలిసి జీవించాలని, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం గ్రామ ప్రధాన ప్రాంతాల్లో నివసించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో అందరితో సమానంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు.


ఎస్టీ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, నివాసానికి అనువైన ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన జీవన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వారికి అవసరమైన అన్ని సంక్షేమ సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.