కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు.
సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం ,కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువజన సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తి పారవశ్యం తో గ్రామ ప్రజలంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజును వైభవంగా ప్రారంభించడం జరిగింది .గ్రామంలోని అన్ని యువజన సంఘాలు మరియు గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది.యాదవ సంఘం, ముదిరాజు సంఘం ,నాయి బ్రాహ్మణ సంఘం శాలివాహన (కుమ్మరి సంఘం) ,అంబేద్కర్ యూత్, సాయిరాం యూత్, శివశక్తి యూత్, గణేష్ యూత్ మరియు బాబు జగ్జీవన్ రావ్ యూత్ ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చక్రాల ఉమా పిచ్చయ్య, ఉపసర్పంచ్ దోసపాటి రవి ,పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి సంధ్యాలింగారెడ్డి,రొండ్ల మణి శ్రీనివాస రెడ్డి, షేక్ సల్మా రఫీ,నీలకంఠం నర్సయ్య,నీలకంఠం వెంకన్న, మర్రిపల్లి ఉపేందర్, జయపాల్ రెడ్డి ,వీరమణి, మమత, గుండ్లపల్లి వీరయ్య, చింతమల్ల సైదులు, పప్పుల వెంకటేశ్వర్లు, పాకాలవీరయ్య, మొగిలిచర్ల నవీన్, తిరుమల సాయి, నీలకంఠం సాయిబాబా,గణేష్ యాదవ్,నవీన్ యాదవ్, బాణాలవిజయ్,చిలక వెంకన్న, పి.వి.ఆర్, మర్రిపల్లి సతీష్, గుండోజు గోవర్ధన్ ,గుండోజు ఉపేందర్, చిక్కుళ్ళ రాజీవ్, అలుగుపల్లి మాధవరెడ్డి, భరత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.