నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన పెరమండ్ల మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్రెడ్డి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యతో పాటు కాలనీవాసులు పాల్గొని మల్లమ్మకు నివాళులర్పించారు.