BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 14 September 2026, 12:02 am
Posted by : గంగుల రాజ్ కుమార్

ఆపదలో అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
14 Sep, 2026 - 12:02 AM
45 వీక్షణలు

అమెరికాలో చికిత్స పొందుతున్న స్పందన కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

మంచిర్యాల | Ntoday News

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె లగిశెట్టి స్పందన ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లింది. మే 31, 2026న చికాగోలోని మెట్రో స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చికాగోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పందించి, స్పందన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్టు, వీసా మంజూరు ప్రక్రియపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జూలై 2న స్పందన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి తమ కుమార్తెను పరామర్శించారు.

అంతేకాకుండా విమాన టికెట్లు, ఇతర అవసరాల కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం స్పందనతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్లేలా సహకరించడంతో పాటు ఆర్థిక సాయం అందించినందుకు ఎమ్మెల్యేకు స్పందన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం అందించడంలో ప్రేమ్ సాగర్ రావు గతంలోనూ చొరవ చూపినట్లు ఆయనకు సంబంధించిన పలు కార్యక్రమాల సమాచారం వెల్లడిస్తోంది. 

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామి, టీపీసీసీ సభ్యుడు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్, నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.