BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 07:05 pm
Posted by : PEDDABOINA SRIKANTH

కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
12 Sep, 2026 - 07:05 PM
59 వీక్షణలు

ఎన్‌హెచ్-563పై వందలాది మంది నిరసన.. సర్వీస్ రోడ్డు, బస్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్

ఎల్కతుర్తి | Ntoday News

ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి రాకపోకల కోసం సరైన మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నేషనల్ హైవే-563 రోడ్డుపై వందలాది మంది మహిళలు, యువకులు, విద్యార్థులు, గ్రామస్థులు కలిసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

నేషనల్ హైవే నిర్మాణం కారణంగా గ్రామానికి రాకపోకలు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయ పనుల కోసం, పశువులు, గొర్రెల కాపరులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు నిత్యం జాతీయ రహదారిని దాటాల్సి వస్తోందని తెలిపారు. సురక్షితమైన దారి లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గత వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. రహదారిని దాటే సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ ప్రజల రాకపోకలకు అనుకూలంగా బ్రిడ్జి లేదా అండర్‌పాస్ నిర్మించాలని, అవసరమైన చోట సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామం వద్ద బస్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్-563లో వివిధ ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి, అండర్‌పాస్‌లు, వంతెనలు, స్థానిక రాకపోకలకు సంబంధించిన మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరంగల్–కరీంనగర్ ఎన్‌హెచ్-563 విస్తరణలో 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్‌పాస్‌లు నిర్మించినట్లు నివేదికలు వెల్లడించాయి. 

కోతులనడుమ గ్రామ ప్రజల సమస్యను అధికారులు పరిశీలించి, ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.