BREAKING
thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 02:34 PM
8 వీక్షణలు

కరీంనగర్ జిల్లా, సెప్టెంబర్ 12: ప్రముఖ కవి, జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం దక్కనుంది. తెలుగు భాష సంరక్షణ సంఘం, తెలంగాణ సాహితి సంస్థ సంయుక్తంగా ఏటా అందించే రాష్ట్రస్థాయి బుర్ర నర్సమ్మ–లింగారెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం–2026కు సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు.

ఈ విషయాన్ని పురస్కార కమిటీ చైర్మన్, పురస్కార వ్యవస్థాపకులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధ్యాసం సేనాధిపతి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. తెలుగు భాష, సాహిత్యానికి తెలంగాణ మట్టి బిడ్డలు అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వారు తెలిపారు.

పురస్కార ప్రధానోత్సవాన్ని ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు భాషా సాహిత్య రంగానికి సుద్దాల అశోక్‌తేజ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.