ద్రావిడ విశ్వవిద్యాలయం పీఆర్వోగా డాక్టర్ ఎస్. నరేష్ నియామకం
ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నరేష్
కుప్పం | Ntoday News
ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా (PRO) డాక్టర్ ఎస్. నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంలోని శ్రీనివాసవనంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు అప్పగించిన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి, విద్యా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ నరేష్ తెలిపారు.
విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్యా, పరిశోధన, అభివృద్ధి అంశాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల విభాగం కీలక పాత్ర పోషించనుంది.