మేడూరు అంగన్వాడీలో ముందస్తు గణపతి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని 93వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ముందస్తు గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి గణపతి ప్రతిమను వివిధ పత్రాలు, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కే. నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని సూచించారు. వినాయక చవితి పండుగ ప్రాధాన్యతను చిన్నారులకు వివరించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు దుర్గ భవాని, చిన్నారులు పాల్గొన్నారు.