రవికుమారి మృతికి నల్లగట్ల స్వామిదాస్ నివాళి
తిరువూరు: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది మేకల నాగేంద్రప్రసాద్ సతీమణి రవికుమారి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యుడు, తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ రవికుమారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రవికుమారి మృతి పట్ల నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
రవికుమారి పార్థివదేహానికి తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చలమల సత్యనారాయణ, పార్టీ నాయకుడు అంకిరెడ్డి అంజన్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.