BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 04:53 pm
Posted by : P. KISHORE

గుడిపాల మండలం లో విషాదం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
11 Sep, 2026 - 04:53 PM
5 వీక్షణలు

గుడిపాల మండలంలో విషాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ఇద్దరు మృతి

మందకృష్ణాపురంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి

చిత్తూరు | Ntoday News

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మందకృష్ణాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చర్చి భవనానికి స్లాబ్ వేస్తున్న సమయంలో సపోర్టుగా ఉన్న పరంజా కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు స్థానికంగా సమాచారం. 

ప్రమాద విషయం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్ ఎం.సి. విజయానంద రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ విజయానంద రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని కోరారు.

ఈ విషాద ఘటనతో మందకృష్ణాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.