BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:43 pm
Posted by : ANTHATI NARENDAR

ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
10 Sep, 2026 - 09:43 PM
25 వీక్షణలు

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్) అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలను టిపిటిఎఫ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టిపిటిఎఫ్ సభ్యులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం నర్రా బిక్షం రెడ్డి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.

ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, నర్రా బిక్షం రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని సభ్యులు కోరారు.

ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ సభ్యులు బాలగోని లింగయ్య, ఉయ్యాల చంద్రశేఖర్, కూనూరు మధు, సుర్కంటి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు