BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:54 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Sep, 2026 - 09:54 PM
12 వీక్షణలు

ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి:

ప్రభుత్వం అందిస్తున్న టీబీ (క్షయ) ఉచిత వైద్య పరీక్షలు, సేవా సౌకర్యాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి కోరారు. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన ఉచిత టీబీ పరీక్షల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా బస్తీ దవాఖానల్లోనే ఉచితంగా టీబీ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. టీబీ తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, సకాలంలో గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి ఆమె సూచించారు. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వివేక్, స్టాఫ్ నర్స్ రాణిలతో పాటు బస్తీ దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.