BREAKING
కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు
Date of Publish : 10 September 2026, 04:16 pm
Posted by : NTODAY NEWS

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
10 Sep, 2026 - 04:16 PM
18 వీక్షణలు

హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ లేబర్ అడ్డా పై నిర్వహించారు. సనత్ నగర్ జోన్ సీఐటీయూ నాయకులు పి.మల్లేష్ మాట్లాడుతూ

 ఆనాడు ఐలమ్మ సంఘం నాయకులతో కలిసి

నాలుగు వందల మంది దేశముఖ్ గూండాలను తరిమికొట్టారన్నారు. 'ఈ భూమీ నాది పండించిన పంట నాది తీసుకెళ్ళడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే యీ పంట,భూమీ దక్కించుకోండి' అంటూ ఐలమ్మ మాటలను తూటాలుగా పేల్చిందన్నారు. సంఘం నాయకులు పండించిన ధాన్యాన్ని,మోపులు కట్టి, ఐలమ్మ ఇంటికి చేర్చారు.

ఐలమ్మ భూపోరాటం, తెగింపు, పోరాట పటిమ ఆనాడు మొత్తం తెలంగాణ నైజాం సంస్థానంలో భూ పోరాటాలకు ఊపునిచ్చిందన్నారు. చివరి శ్వాస వరకు ఎత్తిన ఎర్ర జెండా నిడలోనే పయనించిందన్నారు. నేడు ఐలమ్మ స్ఫూర్తితో మన హక్కులను కాపాడుకోవడానికి, మన సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పరశురాం, బాలకృష్ణ, శ్రీనివాస్, రాందాస్, బిచ్చు, అంజమ్మ, లక్ష్మీ, విజయ, నరేష్ విజయ్, రాజు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు