చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాములు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందన్నారు. మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, ధైర్యం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నకిరికంటి రాజేశ్వరి, బోడిపూడి రేవతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగా హనుమంతరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, సామినేని రామనాథం, సాలిక సురేష్, మువ్వా వెంకయ్య బాబు, పతేపరపు సంగయ్య, చక్రి, దోర్నాల సునీల్, దైవజ్ఞాచారి, అద్దంకి మంజీరా, మల్లెల సత్యనారాయణ, గాలి ప్రసాద్, కోటా డేవిడ్, కోరంపల్లి అంకమ్మరావు, ప్రసాద్ రెడ్డి, ఆవుల శ్రీనివాసరావు, అద్దంకి నాగరాజు, రాయల శ్రీనివాసరావు, బోడిపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.