వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చ
శ్రీ సత్యసాయి జిల్లా | Ntoday News
శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్సీపీ లోక్సభ లీడర్ పి.వి. మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఉషశ్రీ చరణ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్ భాషాతో పాటు జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రజా సమస్యలపై పోరాటానికి పిలుపు
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
ఐక్యంగా పనిచేయాలి
రాబోయే రాజకీయ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.