పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత.
ఎల్కతుర్తి: ఆర్థిక సాయం అందజేస్తున్న పొదుపు సంఘం సమితి అధ్యక్షుడు కంచర్ల శంకరయ్య, పాలకవర్గ సభ్యులు.
మృతుడి కుటుంబానికి వివేకానంద పురుషుల పొదుపు సంఘం -2 చేయూత..
ఎల్కతుర్తి సెప్టెంబర్ 9
మండల కేంద్రానికి చెందిన గొడిశాల విజయ్ కళ్యాణ్ (35) ఇటీవల మరణించగా, వారి కుటుంబానికి బుధవారం రోజున వివేకానంద పురుషుల పొదుపు సంఘం-2 సమితి అధ్యక్షుడు కంచర్ల శంకరయ్య, పాలకవర్గ సభ్యులు 12000, పన్నెండు వేయిల రూపాయల, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ పొదుపు సంఘం లో సభ్యత్వం తీసుకుంటే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంత వారి కుటుంబానికి భరోసా కల్పించినట్లు అవుతుందని అన్నారు. కావున18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సహయం అందజేసిన పొదుపు సంఘం పాలకవర్గ సభ్యులకు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వివేకానంద పురుషుల పొదుపు సంఘం-2 అధ్యక్షుడు పోగుల ప్రభాకర్( ఆర్.ఎం.పి ) ఉపాధ్యక్షుడు రమేష్, శీలం అనిల్ కుమార్, దాసరి రవి, గోడిశాల కిషన్, బోనగిరి నాగరాజు, కొత్తకొండ సదానందం, గణకుడు అల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.