ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
ధర్మపురి, సెప్టెంబరు 9:
తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ధర్మపురి పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కాళోజీ తన రచనల ద్వారా ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, మేనేజర్ గంగాధర్, కౌన్సిలర్లు కొమురెల్లి పవనకుమార్, ముడుసుల ప్రశాంత్, సంగి ఆనంద్, చుక్క సంధ్య, చిపిరిశెట్టి రాజేష్, వొజ్జెల లక్ష్మణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.