కరవు పనులు చేస్తూ కూలీ మృతి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం: ఎలికట్ట గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొలనుకొండ లింగయ్య (59) ఉపాధి హామీ పథకం కింద కరవు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయాన్ని తోటి కూలీలు తెలిపారు.
లింగయ్య గత ఐదారు సంవత్సరాలుగా కరవు పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన లింగయ్య మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
లింగయ్య కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.