BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 09 September 2026, 10:04 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్‌ నుంచి చర్లపల్లికి బస్సులు నడపాలి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
09 Sep, 2026 - 10:04 PM
9 వీక్షణలు

రైళ్లకు స్టాప్ లేక ప్రయాణికుల ఇబ్బందులు.. రాత్రి వేళల్లోనూ సిటీ బస్సులు నడపాలని డిమాండ్

ఘట్కేసర్ | Ntoday News

ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద సూపర్‌ఫాస్ట్‌ సహా వివిధ రకాల రైళ్లకు స్టాప్‌ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమీపంలోని చర్లపల్లి ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘట్కేసర్ నుంచి చర్లపల్లికి వెళ్లేందుకు ప్రస్తుతం సరైన ప్రత్యక్ష ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు.

ఘట్కేసర్ నుంచి సాధారణ సమయాలతో పాటు రాత్రి వేళల్లోనూ చర్లపల్లికి డైరెక్ట్ ఆర్టీసీ సిటీ బస్సులు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఘట్కేసర్, చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొంటున్నారు.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి ఘట్కేసర్–చర్లపల్లి మధ్య నేరుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.