శుభకార్యాల్లో వేధింపులపై DGP సీవీ ఆనంద్ కీలక సూచనలు
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయాలని సూచన
హైదరాబాద్ | Ntoday News
శుభకార్యాలు, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో కొందరు హిజ్రాల నుంచి వేధింపులు ఎదురవుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు చేశారు.
ఓ గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాల నుంచి వేధింపులు ఎదురవగా పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారంటూ ఓ నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుపై డీజీపీ స్పందించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని, బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు.
శుభకార్యాలు, కుటుంబ కార్యక్రమాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు చోటుచేసుకుంటే వాటిని ఉపేక్షించకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.