BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:52 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఖండించాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Sep, 2026 - 09:52 PM
13 వీక్షణలు

బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై ధర్మపురిలో కాంగ్రెస్ నిరసన


ధర్మపురి | Ntoday News

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఐదుగురు దళిత నాయకులకు మంత్రి పదవులు కల్పించి, దళితుల పట్ల తమ పార్టీ నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు.

గతంలో దళిత నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన సందర్భంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారంటూ చేసిన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను సహించేది లేదని వేముల నాగలక్ష్మి హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిపిరిశెట్టి రాజేష్, నాయకులు కుంట సుధాకర్, కౌన్సిలర్లు సంగి ఆనంద్, ముడుసుల ప్రశాంత్, వొజ్జల లక్ష్మణ్, విరవేణి నాగలక్ష్మి, చుక్క సంధ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.