ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
హైదరాబాద్: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమెరికా పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు ముఖ్యమంత్రితో చర్చించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.