కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలని సూచన
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖతో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సిద్ధం కావాలని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.
మీనాక్షి నటరాజన్తో జరిగిన ఫోన్ సంభాషణ నేపథ్యంలో కొండా సురేఖ నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.