గ్రామాభివృద్ధికి సొంత ఆదాయ నిధులు: మంత్రి సీతక్క
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడం, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.
పంచాయతీలకు పన్నులు, ఇతర మార్గాల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం కల్పించడం ద్వారా గ్రామస్థాయిలో ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సొంత ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం ఉండటంతో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు తదితర స్థానిక అవసరాలపై పంచాయతీలు మరింత వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా బలం చేకూర్చడం ద్వారా స్థానిక సంస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.