బ్రిక్స్ సదస్సుతో ఢిల్లీలో హై అలర్ట్.. ప్రముఖ హోటళ్లలో విదేశీ నేతలకు బస
జాతీయం
జాతీయం
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఐటీసీ మౌర్యలో, చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తాజ్ ప్యాలెస్లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్కు ఒబెరాయ్ న్యూఢిల్లీ, యూఏఈ ప్రతినిధి బృందానికి లీలా ప్యాలెస్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే తాజ్ మహల్ హోటల్, ది లలిత్ సహా ఢిల్లీలోని పలు ప్రముఖ హోటళ్లలో వివిధ దేశాల ప్రతినిధి బృందాలకు వసతి కల్పించినట్లు సమాచారం. విదేశీ ప్రముఖుల రాక నేపథ్యంలో భద్రతా విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీలో హోటల్, ఆతిథ్య రంగానికి గణనీయమైన ప్రోత్సాహం లభించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సదస్సు కోసం 3,000కు పైగా హోటల్ గదుల బుకింగ్ జరిగినట్లు సమాచారం.