ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి:
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి:
అన్నమయ్య జిల్లా న్యూస్: చౌడేపల్లి మండలం
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చౌడేపల్లి లో ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
చౌడేపల్లి లో మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి ఎంపి మిథున్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కా o క్షి o చారు. అనంతరం మాజీ సర్పంచ్ భరత్ వరుణ్ ఆధర్వంలో ఎల్.వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు యువత నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు అదేవిధంగా మిద్దింటి కిషోర్ ఆధ్వర్యంలో అన్నదాన శిబిరాన్ని నిర్వహించారు, పలువురికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి. ఉపాధ్యక్షులు అగ్గిదేవరా రమణ. మాజీ ఎంపీలు రుక్మిణమ్మ, అంజిబాబు, వైస్ ఎంపీపీలు రామస్వామి,సుధాకర్ రెడ్డి. నరసింహారెడ్డి, యాదవ్ బోయకొండ మాజీ చైర్మన్ శంకర్ నారాయణ. నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపి మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక పూజలు రక్తదానం అన్నదానం వంటి సేవా కార్యక్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.