పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. ప్రయాణికులపై అదనపు భారం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హైదరాబాద్: పండుగల వేళ ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల పెంపు భారంగా మారుతోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్–హనుమకొండ మార్గంలో ఏసీ బస్సు ఛార్జీలు భారీగా పెరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
ఆగస్టు నెలలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు ఏసీ బస్సు ఛార్జీ రూ.410గా ఉండగా.. సెప్టెంబర్లో అదే ప్రయాణానికి ఏకంగా రూ.570 వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఒక్కో ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడుతోంది.
పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు పెంచుతున్నప్పటికీ, ముందస్తు ప్రకటన లేకుండానే ఛార్జీలను పెంచడం సరికాదని ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పండుగల పేరుతో అదనపు భారం మోపకుండా ఛార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, ఛార్జీల పెంపుపై పారదర్శకత పాటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.