పర్మిషన్లకే పరిమితం.. కఠిన చర్యలెక్కడ!
తెలంగాణ
/
హైదరాబాద్
Hyderabad / Ntoday News: HYDలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి చేసినా, అమలు మాత్రం కాగితాలకే పరిమితమవుతోంది. GHMC నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలో ఇంకుడు గుంతల నిబంధన ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేపట్టడంపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా డ్రైనేజీల్లోకి వెళ్లిపోతోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.