BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:33 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ భక్తి
13 Sep, 2026 - 11:33 PM
16 వీక్షణలు

పల్నాడు: నరసరావుపేటలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పల్నాడు ప్రాంతంలో ఆధ్యాత్మిక, జాతీయ భావాలు వెల్లివిరిసేలా శ్రీ గణేష్ ఉత్సవ సమితి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉత్సవాలను అత్యంత వైభవంగా, ఐక్యతతో నిర్వహించాలనే లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో పల్నాడు పరిధిలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులకు అవసరమైన ప్రచార సామగ్రిని పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండపాల అలంకరణ, ప్రచారం కోసం ఉచిత జెండాలు, ఆకర్షణీయమైన బ్యానర్లు, కరపత్రాలు (పాంప్లెట్లు) మరియు నిర్వాహకులకు గౌరవ సూచకంగా కండువాలను ఉత్సవ సమితి ప్రతినిధులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజంలో భక్తిభావాన్ని, ధార్మిక చింతనను మరియు ఐక్యతను పెంపొందించే వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సామూహిక గణేష్ ఉత్సవాలకు నాంది పలికారనే చారిత్రక సత్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆ మహనీయుని త్యాగాలను, దేశభక్తిని స్మరిస్తూ ప్రతి మండపంలోనూ వినాయకుడి ప్రతిమతో పాటు బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని విధిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ప్రత్యేకంగా సూచించారు. గ్రామ గ్రామాన భక్తులందరూ కలిసికట్టుగా, క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.