BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:01 pm
Posted by : ANTHATI NARENDAR

జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
14 Sep, 2026 - 10:01 PM
6 వీక్షణలు

చిట్యాల: జాతీయ రహదారి–65పై చిట్యాల వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు జాప్యం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు గుత్తా వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను గుత్తేదారు నిర్లక్ష్యంగా, నెమ్మదిగా చేపట్టడం వల్ల సర్వీస్ రహదారి వెంట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పెద్దకాపర్తి వద్ద రహదారిపై వాహనాలు ఒక్కసారిగా కిందికి కుదుపునకు గురవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్, సర్వీస్ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు.

వినతిపత్రంపై మంత్రి వెంటనే స్పందించి సంబంధిత గుత్తేదారు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై మండల ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.