చింతలపూడి: పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో సోమవారం పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉలవ రాఘవరావు (53), సంకు సత్యనారాయణ (47) గాయపడ్డారు. పిడుగుపాటుతో గాయపడిన ఇద్దరినీ స్థానికులు వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురిసిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.