శంషాబాద్లో ట్రావెల్స్ బస్సు బీభత్సం
తెలంగాణ
/
హైదరాబాద్
శంషాబాద్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కంటైనర్ను తప్పించుకునే ప్రయత్నంలో సెవెన్ హిల్స్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాద సమయంలో హోటల్లో టీ తాగుతున్న ఓ వ్యక్తి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంతో హోటల్లో ఉన్నవారు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.