BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా సాముల రామ్‌రెడ్డి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Sep, 2026 - 10:16 PM
0 వీక్షణలు

హైదరాబాద్‌: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా సాముల రామ్‌రెడ్డి ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సాముల రామ్‌రెడ్డి చైర్మన్‌గా, చలకాని వెంకట్ యాదవ్ వైస్ చైర్మన్‌గా, జి. కిరణ్ కుమార్ భారత బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో సాముల రామ్‌రెడ్డికి 12 ఓట్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ గౌడ్‌కు 11 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రామ్‌రెడ్డి విజయం సాధించారు.

వైస్ చైర్మన్ పదవికి చలకాని వెంకట్ యాదవ్‌కు 13 ఓట్లు, జకీర్ హుస్సేన్ జావెద్‌కు 10 ఓట్లు పోలయ్యాయి. దీంతో మూడు ఓట్ల ఆధిక్యంతో వెంకట్ యాదవ్ గెలుపొందారు. భారత బార్ కౌన్సిల్ సభ్యుడి స్థానానికి జరిగిన ఎన్నికలో జి. కిరణ్ కుమార్, జగదీశ్వర్ రావుపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 30న ఎన్నికలు నిర్వహించగా, ఓట్ల లెక్కింపు మార్చి 24న పూర్తయింది.