రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
విఘ్నాలు తొలగించి ప్రజలను సుఖసంతోషాలతో చూడాలని వినాయకుడిని ప్రార్థించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
రావులపాలెం | Ntoday News
వినాయక చవితి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సందర్శించారు. మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండపాల నిర్వాహకులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు.
ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగించి, ప్రతి ఒక్కరికీ శాంతి, సంతోషాలు కలగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రావులపాలెం ప్రాంతంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.