వినాయకుడికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు
మంచిర్యాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
మంచిర్యాల | Ntoday News
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో గణనాథుడికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పండుగ సందర్భంగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, స్థానిక కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.