వెల్గటూర్లో భారీ వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన
తెలంగాణ
/
జగిత్యాల
వెల్గటూర్, సెప్టెంబర్ 14:
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నాడు భారీ వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ ట్రాలీపై ప్రత్యేకంగా అలంకరించి, ప్రధాన వీధుల గుండా కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు.
స్థానిక యువకులు, భక్తులు డప్పు వాయిద్యాలు, జయజయధ్వనుల నడుమ లంబోదరుడిని పూజామండపానికి తరలించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన ఈ భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.