రాంనూర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి ప్రతిష్ఠాపన
తెలంగాణ
/
జగిత్యాల
రాంనూర్లో బొజ్జ గణపయ్యకు ఘన స్వాగతం: అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పూజలు
వెల్గటూర్, సెప్టెంబర్ 14
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో వినాయక చవితి పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాంనూర్ గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని సోమవారం ఘనంగా ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని పూజించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.