గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు
ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలో శిరిడి సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ధర్మకర్తలు పోతక నాగరకమ్మ, పోతక వెంకటరెడ్డితో పాటు దాతలు కరణం సావిత్రమ్మ, కరణం లక్ష్మారావు జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా చిత్రపటంతో పురవీధుల్లో భక్తులు ఊరేగింపు నిర్వహించారు.
మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు భజనలు, భక్తి గీతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రావు, ఐ. లక్ష్మీనారాయణ, టీ హోటల్ శేఖర్, కె. రఘునాథ్, బాలకృష్ణ, రామలింగప్ప, చంద్రశేఖర్ నాయక్, వాల్మీకి రవితో పాటు ట్రస్ట్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.