BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 11:19 pm
Posted by : MENDI SRINIVASARAO

స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులకు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
12 Sep, 2026 - 11:19 PM
5 వీక్షణలు

పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్ రవి కుమార్‌కు ఘన స్వాగతం

పార్వతీపురం మన్యం | Ntoday News

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు విచ్చేసిన గోల్డెన్‌సూ మైరైన్డా ఆక్వా హేచరీస్ అధినేత, సూడా చైర్మన్, అరకు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ కొరికనా రవి కుమార్‌ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ కమిటీ సభ్యుడు పెంట శంకర్ రావు, జియ్యమ్మవలస జనసేన పార్టీ నాయకులు, ఆక్వా రంగంలో పారిశ్రామికవేత్త మెండి రమేష్, అరకు పార్లమెంట్ సపోర్టింగ్ టీం సభ్యుడు లచ్చిపతుల రంజిత్ కుమార్ తదితరులు రవి కుమార్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడంపై చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలం కూడా భాగంగా ఉంది. 

ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు.